Wednesday, May 30, 2018

"అన్నమయ్య సారస్వత క్షీర సముద్రం"


శ్రీ తాళ్ళ పాక అన్నమయ్య 610 జయంతి మహొత్సవం

"అన్నమయ్య సారస్వత క్షీర సముద్రం"

శ్రీ కామిశెట్టి శ్రీనివాసులు గారి సభాద్యక్షత వహించి గురువులు శ్రీ రాళ్ళబండి అనంతక్రిష్ణ శర్మ గారు, శ్రీ పి వి ఆర్ కే ప్రసాద్ గారు లను తలుచుకున్నారు.  1978 లో పాట-మాట-ఆట అని "అన్నమయ్య కథ" LP record" చేసారు.  శ్రీ డా నారాయణ రెడ్డి గారు అది చూసి నాట్యమే చేసారు.  మొదటి సారి చిన సత్యం గారిచే నాట్యం కూర్చి, అభినయ యోగ్యంగా శోభానాయుడు గారిచే చేయించారుట అన్నమయ్య కీర్తనలు - "కులుకక నడవరో కొమ్మలాలా", "పలుకుతేనెల తల్లి"...........రోసారి పండిత్ జవహర్లాల్ గారి ముందు పర్వీన్ సుల్తానా, MS పాడుతే , బాలమురళి గారు - "అన్నమయ్యా ఉన్నావయ్యా" అని రాసి పాడారు అహోబిల సాంప్రదాయంలో పె /చిన తిరుమలయ్య సంగీతం చేసారు ఎన్నో గీతాలు..."అప్పటి వరప్రసాది.....అందముగా నిలిచినాడు అన్నమయ్య" లాటివి గానం చేసారు 
శ్రీ కొమండూరి శేషాద్రి గారు మాట్లాడుతూ.......కాదు కాదు...........పాడుతూ... అన్నమయ్య పురందర దాసుని ఆచార్యులు.  "నారాయణతే నమొ నమొ" వ్రాసారు.  "చేరి" యషోదకు"  లో ఛేరి అంటే - పద సబరి - సంచారీ భావము - బిడ్డడుగా ఉండటానికి కారణం చెప్పాలి అందుకు. 
"అలరులు కురియగ",
"వందేహం మంగళం వల్లభం",
"రామ నామ ...కాల శ్రీవాసుదేవం శ్యామలం కోమల" అని నెమ్మది, విశ్రాంతి , రాగం - తాళం. 
"బ్రహ్మ కడిగిన పాదం " - 14 పాదాలు - చతుర్దస పాదాలు..
"భగవంతుని నామ-రూప వైభవం"

పాడినా....."ఆడిన అడుగడుగుకు అన్నమయ్య అన్నాము నేను,
అన్నమయ్య విన్నాను - అన్నమయ్య కన్నాను
వేడుక తోడని  నిను నేను అన్నమయ్య అన్నాను అన్నమయ్య,,,,,,,,"

"ఇందరికీ అభయమ్ము చ్చు చేయి"
"అదిగో అల్లదిగో "- సూచనిత్మకము, దర్శనాత్మకం గా వ్రాసారు...............
"కనుగొంటినీ" - దర్శనాత్మకము

"విభూతి పురుషుడు" - భగవంతుడు పంపిన ఒక పురుషుడు..

"శ్రీమన్నారాయణ"....MS - బాలమురళి - భగవంతుడు పంపిన వారు  పాడటానికి అని ముగించారు.

తరువాత డా ముక్తేవి భారతి గారు అన్నమయ్య సాహిత్యం గురించి అందంగా హుందాగా మాట్లాడారు. 

నృ సిం జయంతి మరియు అన్నమయ్య జయంతి ఒకేసారి వస్తాయి...స్వాతి - విశాఖ నక్షత్రాలు కాబట్టి. 

32 వేల సంకీర్తనలు అన్నమయ్య వ్రాసారు.  32 వేలు ఎందుకు అంటే - నృ సిం ఉపాసకుడు కాబట్టి - అందులో 32 పదాలు ఉంటాయి.
'
"క్షీర సముద్రం" - ఉన్న అంశాలన్నీ ఉన్నా యి. 
ఆయన వ్రాసిన "పదాలు" లో - సాహితీ వేత్త, అభ్యుదయ కవి, ప్రజా కవి, తల్లి తనం కనిపిస్తాయి, సమసమాజ నిర్మాణం , అందుకే పద కవితా పితామహుడు అయ్యాడు.

1. తల్లితనం అన్నది  - "ఉగ్గుపెట్టరే ఓయమ్మా" లో - కడుపులోని లోకాలు కదలుతాయి..
"శిశువునో, ఆకొంటినో , వెర్రినో, ఊగ్గు పెట్టావే యమ్మా"........... "అన్నమయ్యే యశోదగా" గోచరిస్తాడు.

2.  "కానరటే పెంచ రటే" - తల్లి తన తనయుని రక్షించుకున్నట్లు....

3.  "మతాలు .....మత మెల్లను.....; ఎంత మాత్రమున" .. లో పిండి కొద్దీ రొట్టె లాగా; - మత సామరస్యము..

4.  నవ రసాలు - "అవధరించ ........తేనెమోవి రసము   చెలియ చక్కదనాల ...రసము...శాంత  రసము.."

5.  చదువులు -   "ఇన్ని చదువులెల్ల....వెనక వారి చదువు....పొలతుడు జీవుడే - పురుషులు జీవులే" "  వలదనే బంధం - వలదంటే మోక్షం...- నారాయణాక్షరాలు, జారమైన ప్రహ్లాదాదులు చదివిన చదువు....
6.  "ముద్దుగారే యషోదా" - ముత్యాలంటే ఎంతో ఇష్టం - నవ రత్నాలు... 
7.  జాన పదాలూ - "ఏలే ఏలే మరదలా....................' సువ్వీ సువ్వీ...."

శ్రీమతి నిష్టల సుధామాల గారు ప్రసంగిస్తూ............

ఆయన ఒక నాట్య యోగి అనీ - "లక్షణ సమన్వితుడైన గురువు" అనీ నిర్వచించారు.  నాయికా-నాయకులూ- దరువు పధతి లో ఉండేలా రచించారని అన్నారు.  ఆయన 8 ఏట కొండ ఎక్కారనీ చెప్పరు.  "అలరులు కురియగ ....జల జల రాలాటం" అనంది - "పూర్వ రంగమనీ" ;  "మట్టెల కెలపుల - చిందుల పాటల, అరవిరి సొబగుల",  - "ఆకాశకీ చారుల అనీ,  కుప్పి/భ్రమర కుప్పి కూచిపూడి సాంప్రదాయంలో వాడతారనీ చెప్పారు.
"అనాహత చక్రం లోని ఉన్న సిం హం " ని వర్ణించారు.  జీవాత్మ లో పరమాత్మ కలిసిపోవటం.  అమ్మవారు "కామ యాగం" చేసింది అంటారుస్వాధిష్టానం నుంచి అనాహత చక్రం నుంచి చేయటం - కామ యాగం...అని వివరించారు.
 మన్మధ బీజాక్షరం - అమ్మవారు, నాయికా- నాయకులు, గోపికలు...
"వలచి వచితి నేను" - అభిసారిక నాయిక...
"విరహపు రాజుకి" - వాసవ సజ్జిక నాయిక

సత్యభామ ప్రవెశ దరువు..."వచెను అలమెలు మంగ "...పా వినిపించారు..
సంవాద దరువు - లక్ష్మి - సరస్వతి.."రావే కోడల...రత్నని కోడల...." 

వర్ణణా దరువు - "కట్టేదురా వైకుంథము..."

దశావతారం - "డోలాయాంచల .."' "సిరుత నవ్వుల వాడు సిన్నెక్క...".

వీర రసం - "దేవ దేవం భజే దివ్య ప్రభావం, పంక జాసన వినుత పరమ నారాయణం", - రామ ధనుర్భంగం...

భయానక రసం - ప్రహ్లాద - నృ సిం

తిల్లన లాగా - "తతాడికుడి ధీం ధీం.."

పెళ్ళి పాటలు - "ఎక్కడ మాయ జింక - ఏల తెమ్మంటివి" అని అమ్మవారు   బాధ పడిందిట.

"పరమ పురుషుడు"  - పూర్తి చేసారు.ఉమా రమా రావు గారిని గురుథు చేసికోవాలి అని పాట పెట్టారు.

  


శ్రీమతి రేణుకా ప్రభాకర్ గారు మత్లాడుతూ....ఆయన ఒక ...

1. మంత్రం - వేంకటెస్వర మంత్రం
2. పొలము - దేహార్ - అనగా చీరలమ్ముకునే ఒక వ్యాపారి = సర్వం విష్ను మయం - లోకులందరు..
3. మందు - లాటి వాడు - వేంకటెస్వర స్వామి రోగాలు పోతాయి..
4. పండు - వేంకటెస్వర స్వామిని "పండు గా వర్ణించాడు - పాలవెల్లిలో పండిన పండు..
5. ఢనము - కోరినవన్నీ ఇస్తాడు కాబట్టి - స్వామి అనే ధనము..
6. బోయనాయుడు - మత్సావతారం తో పోల్చాడు - భూతం తో పోల్చాడు - భూత పట్టుకుంటే మంచిదిట. పట్టుకుంటే మోక్షాన్నిచ్చే నల్లని భూతం .
7. నేతబేహార్ - నేత బట్టలు చీరలు అమ్మె నేసే అమ్మే బేహార్...మంచి మంచి వి అమ్మీ వాడు..
8. సింఘం - తో పూలాచాడు - "వీడే...వీడే...".. 

దరువులు - భామాకలాపం లేదా కలాపం
అన్నమయ్య - "సంగ్రామ వీర లక్ష్మి ...."సత్యభామని వర్ణిచినట్లె.. పొలతి సత్య భామ - ...ఎక్కుడు చేసితివి - కొమ్మలాల - అమ్మలసొమ్మిచేత...వాడమయ్యే...ఆటదాని"...తూర్పున పొడచు...చిలుక పావురము...వలపుల దాడి వచె...ముందు నున్న పశువులాల...


హరి భటులు...నూరి భటులు...అంటూ భాహ్మణులను వర్ణించారు..

.............................................................












Tuesday, May 29, 2018

తెలుగు వారి లాస్య-తాండవ నర్తన రీతులు


త్యాగరాయ గాన సభలో 25.05.2018 నాడు నవ్య నాటక సమితి మరియు అన్నమయ్య మిషన్ ఆధ్వర్యం లొ జరిగిన సదస్సులో "తెలుగు వారి లాస్య-తాండవ నర్తన రీతులు" అనే అంశం మీద డా. సువర్చలాదేవి గారు, పేరిణీ కుమార్ గారు ఆంధ్ర నాట్యం మరియు పేరిణీ శివ తాండవం గురించి వివరించటం జరిగింది.  వారి వారి శిష్యులు నాట్యం చేసి ప్రదర్శించారు. 
సదస్సు 6 జూన్ పద్మశ్రీ శ్రీ నటరాజ రామక్రిష్ణ గారి 8 వర్ఢంతి సందర్భంగా నిర్వహించటం మూలంగా ఆంధ్ర నాట్యం మరియు పేరిణీ లకి ప్రాముఖ్యత ఈయటం జరిగింది.
ముందుగా డా సువర్చల గారు ఆంధ్ర నాట్యం లోని లాస్య రీతుల గురించి మాట్లాడారు. గురు రామక్రిష్ణ గారు తమ ఊహాశక్తి ని వాడి, దేవాలయాల్లోని శిల్పాలను చూసి, ఇవి ఎలా వచ్చి ఉంటాయి అని ఆలోచన చేసి ఆయా శిల్ప కళాకృతులను మరిపించేలా నాట్య భంగిమలను చొప్పించి నాట్య రీతులను క్రమభద్రీకరించారని వివరించారు.
ఆధ్యాత్మికతకు ఓం కారమే ప్రధానం.  నృత్య రీతులలో వాడే "తాం తాం తాం...." అనే శబ్దమే ఓంకారం జనింపచేస్తుంది కాబట్టి నాట్యం కోవకు చెందిందే అన్నారు.  "తెలుగు భరత నృత్యం", "తెలుగు ఆంధ్ర నృత్యం" లేదా "ఆంధ్ర నాట్యం" అని నామకరణ చేయాలని 23 Aug 1970 లో జరిగిన సదస్సులో సర్వే మాణిక్యంబ గారు, అన్నాబత్తుల వారు, నటరాజ రామకృష్ణ గారు లాస్యాభినయం, ఆధ్యాత్మిక రామాయణం మొ!! అంశాలను ప్రదర్శించగా తిలకించి, "ఆంధ్ర నాట్యం"  అని పేరు నిశ్చయం చేసారు.  కూచిపూడి సదస్సులో సంస్కృతం లోని పదాలకి అభినయించిన తీరు, వాటికి వ్యాఖానించిన తీరూ చూసి, సంగీత నాటక ఆకాడమీ వారు తెలుగులో ఇంత సాంప్రదాయం ఉందా అని ప్రొత్సహించారు.  మళ్ళీ 1974 లో జరిగిన సదస్సు  నృత్త ప్రధానమై, అంగ విక్షేపంగా ఉండి దార్శనీయంగా ఉండి అందరినీ ఆకట్టుకుంది. తిరిగి 1982 లో శ్రీశైలంలో చేసిన సదస్సు తో ఆంధ్ర నాట్యానికి వన్నె తెచ్చింది. ఆయన యొక్క philosophy “sound and vibration”.  ఆయితే తరవాత ఇది "తెలుగు విశ్వవిద్యాలయం లోకి కలిపివేసారు.
రాధాకుమారి గారు, ఉమారామారావు గారు, సుమతీకౌషల్ గారు మొ!! వారు మొదటి జనరేషన్; కళాకృష్ణ గారు లాటివారు రెండవ జనరేషన్ వారు, మరియు సువర్చలాదేవి వంటి వారు మూడవ జనరేషన్ వారు క్రింద లెఖ కట్టవచ్చుననీ అభిప్రాయపడ్డారు. ముఖలింగ క్షేత్రం నుంచి తెలంగాణలో అన్ని దేవాలయాల్లో ఆంధ్ర నాట్యం ప్రదర్శితమైనదనీ చెప్పారు. 
ఆగమ నర్తన విధానం లో "కుంభ హారతి" చేసి రంగస్థలం పైకి వస్తారనీ చెప్పారు.  తరువాత "చూర్నిక", "నవ సంద్య" మార్గ పద్ధతి లో అందరు అషట దిక్పాలకులాకుల ముందు అన్ని చోట్లా చేసి అప్పుడు నాట్యారంభం చేస్తారు.   "కైవార గీతాలు", శబ్దం", ఏక తాళ జతులూ ఉండేలా నాట్యం చేస్తారని చెప్పారు. సమ తాళ జతులు - 13, 15 అక్షరాలతో  చేస్తారు.   సాయంకాలం ప్రదర్శనలు నృత్తం తోనే ఆరంభం అయ్యేవనీ, అంగ విక్షేపాల తో కొంత శరీరం తేలికై నృత్యం చాలా బాగుంటుంది చూడటానికి అని అన్నారు.  చివరగా కొద్దిగా "సర్వే మాణిక్యాంబ గారి వలే కూర్చుని "ఆధ్యాత్మిక రామాయణం", ఒక "జావళి" నర్తించి చూపారు.  ప్రబంధ నర్తన రీతిలో "భామా యని నన్ను పిలతురే" అని భామాకలాపం మాదిరి చేసి చూపారు వారి శిష్యురాలు. 
తరువాత "పేరిణీ కుమార్"  గారు "తాండవ రీతి" లో  నర్తనం గురించి వివరించారు.  చెప్పారనటం కంటే చేయించి చూపారు.  శరీరం అంతా రోమంఛితమై ఒక లాటి సుసుప్తావస్తకి గురియింది. తాళ, లయ, గతులు ఒకటై చూడముచ్చటగా నాట్యాన్ని శిష్యుల చేత చేయించారు.
"పేరిణి" అంటే సృష్టి అని అర్థం. "నాయుడుపేట నాయుడమ్మ" గారు "ఫేరిణీ" నాట్యాన్ని పైకి తెచ్చారని విన్నాము. ఆయనే నటరాజ రామకృష్ణ గారికి గురువు గారినీ చెప్పారు. "జాయప సేనాని" వ్రాసిన పుస్తకం లో - 1) లాస్య తాండవ అనీ 2) తాండవ లాస్య మనీ చెప్పబడింది, స్త్రీలు - పురుషులు చేసే పద్ధతిని వివరిస్తూ.
పేరిణీ పంచంగాలు - భరత నాట్యం లో మూలంగా కనిపిస్తాయన్నారు. కాకతీయులు తరవాత మరుగునపడింది.  పురుష సాంప్రదాయం - పేరిణీ నృత్యం.  చాలా విన్యాసాలు గురించి వివరించారు - 1) సమైక్య విన్యాసాలు 2) ఢమరకైక విన్యాసాలు 3) పిపీలకైక విన్యాసాలు.   వీటిని తాళంలో, మృదంగంలో వినిపించారు. 
తాతరి తాం....
తా తరి తధణ తోం...
వంటి పల్లవి జతులు, శిల్ప భంగిమలు, విలంబ గతి నుంచి విస్త్రుతంగా.....ఉండేవి చూపించారు. కైవార గీతాలు 4 గంటల పాటు ప్రదర్శనా క్రమం లో తీర్చిదిద్దినట్లు చెప్పారు.  పంచ భూత నర్తనం తో ముగించారు. "వికటం" చేసి ప్రేక్షకులను నవ్వించేవారు.  "విషమం" చేసి ఆకాశచారి సంచారి చేయటం ఇంక చేస్తూనే ఉన్నారని చెప్పారు.
కడప లో ఒకసారి ప్రదర్శన ఇచ్చినప్పుడు విశ్వనాథ వారు దండం పెటారనీ  - ఆంధ్ర నాట్యం - పేరిణీ లోని పదాభినయం చూసీ మురిసిపోయారనీ చెప్పారు. 
వేసవి లో నేల లి తరువాత తొలకరిలో చిగురించి వికశించి నట్లు ఉండే విన్యాసం  - " తక్కు దిక్కు".... చేసి, వినిపించి కనులపండువగా చూపారు.  ఇది శివునికి శరీరాన్ని సమర్పించే భక్తుని ప్రేరణగా తీసుకుని కూర్చటం జరిగిందని వివరించారు. "పృథ్వి లింగం నుంచి - ఆకాశ లింగం" దాకా "సమీకరణీక విన్యాసం  చివరగా చూపించారు. మిలిన నాట్యాలలాగా 3 తీర్మానాలు కాకుండా "పేరిణీ" నాట్యం లో 5 తీర్మానాలు చేస్తారని చేయించి చూపారు.